ఎన్టీఆర్ జిల్లాలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కంచికర్లలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని చదువుతోంది. ఈమెకు పరిటాలకు చెందిన గాలి సైదాతో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బలవంతంగా నగ్న ఫొటోలు కూడా తీశాడు.
ఫొటోలతో ఆ యువతిని బెదిరించి..
ఆ ఫొటోలను యువకుడు స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహితులు కూడా ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు. ఆ వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





