ఎన్టీఆర్ జిల్లాలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు మాయ మాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేసి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కంచికర్లలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని చదువుతోంది. ఈమెకు పరిటాలకు చెందిన గాలి సైదాతో స్నేహం ఏర్పడింది. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతంగా ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ సమయంలో బలవంతంగా నగ్న ఫొటోలు కూడా తీశాడు.
ఫొటోలతో ఆ యువతిని బెదిరించి..
ఆ ఫొటోలను యువకుడు స్నేహితులకు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. స్నేహితులు కూడా ఆమెను బెదిరించడం మొదలు పెట్టారు. ఆ వేధింపులు భరించలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Also read
- కంటి సమస్యలకు దివ్య పరిష్కారం! అద్భుత శక్తి గల వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?
- భౌమ ప్రదోష వ్రతం 2026: అప్పుల బాధలు తొలగి, శివానుగ్రహం పొందేందుకు ఈరోజు ఈ పనులు తప్పక చేయండి!
- హనుమజ్జయంతి, బుద్ధ పూర్ణిమ, కాలాష్టమి సహా మే 2026లో విశిష్ట రోజులు ఇవే!
- టెంక్షన్ ఆందోళనలకు చెక్ పెట్టే శక్తివంతమైన మంత్రాలు, రోజూ జపించండి.
- అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది.





