తన చేతుల్లో పెరిగిన మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకొందన్న ఆవేదనతో ఓ మేనమామ విందుభోజనంలో విషం కలిపాడు.
కొల్హాపుర్ (మహారాష్ట్ర): తన చేతుల్లో పెరిగిన మేనకోడలు ఇష్టమైన వ్యక్తితో పారిపోయి పెళ్లి చేసుకొందన్న ఆవేదనతో ఓ మేనమామ విందుభోజనంలో విషం కలిపాడు. మహారాష్ట్రలోని కొల్హాపుర్ జిల్లా పన్హాలా పోలీస్ స్టేషను పరిధిలో జరిగిన వివాహ రిసెప్షనులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉట్రే గ్రామంలోని మేనమామ మహేశ్ పాటిల్ ఇంట్లో పెరిగిన ఆ యువతి తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకోవడం కుటుంబసభ్యులకు నచ్చలేదు. అయిష్టంగానే ఆ జంటను ఆశీర్వదించి రిసెప్షను ఏర్పాటు చేశారు. ఆందోళనతో రగిలిపోతున్న మేనమామ మహేశ్ అతిథుల కోసం సిద్ధం చేస్తున్న భోజనాల్లో విషం కలిపాడు. దూరం నుంచి దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు మహేశ్ను నిలదీయడంతో అతడు అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. అతిథులు ఆ భోజనం ఆరగిస్తే పెద్ద అనర్థమే జరిగేది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ఆహార పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు.
Also read
- Viral Video: నన్ను ఎవడు ఆపేది.. నడిరోడ్డుపై రెస్ట్ తీసుకుంటున్న మందుబాబు !
- నేటి జాతకములు…19 జూన్, 2025
- ఆంధ్ర: తల్లికి వందనం పడిందా అని అడిగారు.? ఒక్క ఫోన్ కాల్తో అంతా పాయే
- పక్కింటి పిల్లాడు ఇచ్చిన ఒకే ఒక్క క్లూ.. వీడిన మహిళ మర్డర్ మిస్టరీ..!
- Andhra: ఆవు దూడ కోసం గొడవ.. క్షణాల్లోనే అన్నను మట్టుబెట్టిన తమ్ముడు.. అసలేం జరిగిందంటే