యశవంతపుర: బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసిన కామాంధునికి మంగళూరు అడిషనల్ జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధించింది. గతేడాది మార్చి 10న రాత్రి బాలిక ఇంటిలో స్నానం చేస్తుండగా గగన్ అనే యువకుడు ఫోన్తో వీడియో తీశాడు.
బాలిక తల్లిదండ్రులు అతనిపై మంగళూరు జజ్పె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి వినయ్ దేవరాజ్ ఈ మేరకు తీర్పునిచ్చారు. జరిమానా కట్టలేని స్థితి ఉంటే మరో మూడు నెలలపాటు శిక్షను అనుభవించాలని ఆదేశించారు. బాధిత బాలికకు ప్రభుత్వం నుంచి రూ. లక్ష పరిహారంగా అందించాలని అధికారులకు సూచించారు.
Also read
- నేటి జాతకములు 4 ఫిబ్రవరి, 2025
- Andhra News: జర భద్రం.. ఒక్క ఫోన్ కాల్తో రిటైర్డ్ టీచర్ నుంచి రూ.36 లక్షలు కొట్టేశారు.. చివరకు
- వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడనే కోపంతో..
- పుట్టిన గంటకే భిడ్డకు దూరమైన తల్లి
- Vishnuja: జాబ్ లేదు.. అందం అసలే లేదు!