విశాఖపట్నం మహిళ ఎస్ఐ మానవత్వం చాటుకున్నారు. విధి నిర్వహణలో అధికారి అన్న విషయం మరిచిపోయారు. రైల్వే ట్రాక్ వద్ద ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పంచనామా నిర్వహించిన పోలీసలు, మృతదేహాన్ని మార్చురీకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ప్రాంతానికి వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తానే స్వయంగా మృతదేహాన్ని భుజాన మోస్తూ తీసుకెళ్లారు ఎస్ఐ సూర్యకళ.
అది విశాఖ గాజువాక ప్రాంతం.. జగ్గయ్యపాలెం రైల్వే క్యాబిన్ కు సమీపంలో ఓ డెడ్ బాడీ..! దాదాపు 30 ఏళ్ల వయసు ఉంటుంది. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతదేహం కుడి చేయి రెండు పాదాలు కాలిపోయినట్టుగా ఉన్నాయి. శరీరంపై కొన్ని గుర్తులను నోట్ చేసుకున్నారు. అదే రైల్వే ట్రాక్ ప్రాంతానికి సమీపం కావడంతో.. అక్కడికి వాహనాలు వెళ్ళవు. కానీ ఆ మృతదేహాన్ని తరలించాలి. దీంతో ఆ మహిళ ఎస్సై స్వయంగా రంగంలోకి దిగింది.
శుక్రవారం(డిసెంబర్ 27) ఉదయం పన్నేండు గంటల ప్రాంతంలో.. పోలీసులకు ఫోన్ కాల్.. జగ్గయ్యపేట రైల్వే క్యాబిన్ సమీపంలో ఓ మృతదేహం అనుమానాస్పదంగా పడి ఉందని. పోలీసులు రష్ అయ్యారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాల కోల్పోయాడు. పోలీసులు ఐడెంటిఫికేషన్ మార్క్స్ను గుర్తించారు. స్కై బ్లూ రంగులో షర్టు, బ్లాక్ కలర్ ప్యాంటు.. ధరించి మెడలో ఎరుపు రంగు తాడు. కుడి చేతికి కి ఎరుపు తాడు.. అదే చేతికి నల్లని రిస్ట్ బ్యాండ్… చేతికి కే అక్షరంతో టాటు.. ఆ తర్వాతి అక్షరాలు చేయి కాలిపోవడంతో కనిపించలేదు. జేబులో 21వ తేదీన కైకలూరు నుంచి దువ్వాడ వరకు సెకండ్ మెయిల్ ఎక్స్ప్రెస్ టికెట్ ఉంది. మరిన్ని ఆధారాలు గుర్తించారు పోలీసులు..
ఆ తర్వాత బాడీని భద్రపరచాలి..! మార్చురీకి తరలించాలి.. మృతదేహం రైల్వే ట్రాక్ ప్రాంతం కావడంతో.. అక్కడకు వాహనాలు వెళ్లే పరిస్థితి కనిపించలేదు.. దీంతో పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న గాజువాక మహిళా ఎస్సై సూర్యకళ ముందుకు వచ్చారు. పురుషులతో సమానంగా.. మృతదేహాన్ని భుజాలపైకి ఎత్తుకుని మోశారు. అక్కడ మరింత మంది పురుషులు ఉన్నప్పటికీ మానవత్వంతో ఆ మృతదేహాన్ని స్వయంగా మోసి వాహనం వరకు తీసుకెళ్లారు
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..