నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
విశాఖపట్నం, పెద్దవాల్తేరు: నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖకు చెందిన ఓ మహిళ తలకు గాయమై సోమవారం రాత్రి ఆసుపత్రికి వచ్చింది. స్కానింగ్ చేయించాలని వైద్యులు సూచిచండంతో .. అదే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్కు వెళ్లింది.
ఇదే అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇన్ఛార్జి ప్రకాశ్ .. స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలని చెప్పాడు. ఆ తర్వాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు ప్రకాశ్కు దేహశుద్ధి చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న విశాఖ మూడో పట్టణ సీఐ రమణయ్య ఆసుపత్రికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో రోగులు నరకం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





