ప్రకాశం గిద్దలూరులో సుహాసిని సహజీవనం చేయడం లేదని ఓ యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆమె భర్త రెండేళ్ల కిందట మరణించగా.. నాని అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఆ తర్వాాత ఇద్దరి మధ్య గొడవలు రావడంతో తల్లిదండ్రులతో ఉండటంతో ఆమెను హత్య చేశాడు
సహజీనవం చేయలేదని ఓ మహిళలను కత్తితో హతమార్చిన ఘటన గిద్దలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాచర్లకు చెందిన సుహాసినికి ఒక కుమారుడు, కొడుకు ఉన్నాడు. రెండేళ్ల కిందట సుహాసిని భర్త మరణించడంతో ఆమె రాచర్లకు చెందిన నాని అనే వ్యక్తితో హైదరాబాద్ వెళ్లిపోయింది. కొన్ని నెలల పాటు అతనితోనే సహజీవనం చేశారు.
ఇబ్బంది పెట్టడంతో పోలీసులకు..
ఇద్దరి మధ్య గొడవలు రావడంతో కొన్ని నెలల తర్వాత సుహాసిని గిద్దలూరులో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. అక్కడికి వచ్చి కూడా కలిసి ఉందామని నాని ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయిన కూడా నాని మారకుండా సుహాసినిపై దాడి చేశాడు
ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేయగా.. మెడ దగ్గర తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ కొంత సమయానికే చికిత్స తీసుకుంటూ సుహాసిని మరణించింది. బాధితరాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో మార్నింగ్ వాక్కు చేస్తున్న బిజినెస్ మ్యాన్పై దుండగులు కాల్పులు జరిపారు. ఢిల్లీలో ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతున్న క్రమంలో రాజధానిలో కాల్పులు సంచలనంగా మారింది. ఢిల్లీలోని షాహదారా జిల్లాలో ఫార్శ్ బజార్ ఏరియాలో ఉదయం గుర్తు తెలియని దుండగులు బైక్పై వచ్చి సునీల్ జైన్పై కాల్పులకు తెగబడ్డారు. దుండుగులు ఎనిమిది రౌండ్స్ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read
- అయ్యో ఎంత పని చేశావ్ తల్లి.. ఉరివేసుకొని 5వ తరగతి బాలిక ఆత్మహత్య.. ఎందుకంటే?
- అయ్యో అనిత.. మరికాసేపట్లో డెలివరీ.. అంతలోనే వైద్యులు వచ్చి ఏం చెప్పారంటే..
- ఎంతకు తెగించార్రా..! రూ.30 వేల అప్పు కోసం 21 రోజుల పసికందు కిడ్నాప్..!
- Hyderabad: అంతా పక్కా స్కెచ్.. బెడిసికొట్టిన ఫ్లాన్.. ఏటీఎం చోరీ కేసులో సంచలన ట్విస్ట్!
- అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తే.. నువ్వు చనిపోయావ్గా అన్నారు.. అసలు ఏమైందంటే..?





