చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని షేక్షావలితో చెప్పడంతో దాడి చేసినట్లు పుల్లారెడ్డి ఆరోపించారు.
.Mining Mafia : నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. టీడీపీ నేత బీటెక్ పుల్లారెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడింది. తమ్మరాజుపల్లె మైనింగ్ మాఫియా హత్య చేయడానికి తెగబడింది. స్కార్పియో, బొలెరో వాహనాల్లో 15 మంది మైనింగ్ మాఫియా సభ్యులు వచ్చారు. మూకుమ్మడిగా రెండు కార్లలోంచి దూకి పుల్లారెడ్డి, ఆయన కొడుకుపై దాడి చేశారు. పాణ్యం బస్ స్టాండ్ సమీపంలోని జుర్రాకు వద్ద ఈ ఘటన జరిగింది.
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ పుల్లారెడ్డి, ఆయన కొడుకుపై ఒక్కసారిగా రాడ్లు, కర్రలతో షేక్షావలి అతని అనుచరులు దాడి చేశారు. పుల్లారెడ్డి, అతడి కొడుకుని శాంతిరాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ్మరాజుపల్లిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై షేక్షావలిని ప్రశ్నించిందుకు దాడి చేసినట్లు పుల్లారెడ్డి చెబుతున్నారు.
గ్రామంలోని టిప్పర్లు, మైనింగ్ యజమానుల నుంచి షేక్షావలి నెల నెల అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పుల్లారెడ్డి ఆరోపించారు. టీడీపీ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని, చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని షేక్షావలితో చెప్పడంతో దాడి చేసినట్లు పుల్లారెడ్డి ఆరోపించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!