ఖమ్మం సమీపంలోని దానవాయిగూడెంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మొత్తం నలుగురు స్నేహితులు సోమవారం రాత్రి ఆటోలో ఆ కాలువ వద్దకు వచ్చారు.
ఖమ్మం ఖానాపురం హవేలి, : ఖమ్మం సమీపంలోనిదానవాయిగూడెంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. మొత్తం నలుగురు స్నేహితులు సోమవారం రాత్రి ఆటోలో ఆ కాలువ వద్దకు వచ్చారు. వారిలో ఒకరు ఆటోలో నిద్రపోగా.. మిగిలినవారు కాలువ వద్దకు వెళ్లారు. వారిలో ఒకరి మృతదేహం లభించగా.. మిగిలిన ఇద్దరూ ఏమయ్యారనేది తెలియరాలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని శివలింగాపురం గ్రామానికి చెందిన చల్లా రమేశ్, ప్రసాద్, బండారు భరత్ (30), రొండ వెంకటేశ్వర్లు ఖమ్మం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తమ స్నేహితుడు రామును చూసేందుకు సోమవారం ఆటోలో ఖమ్మం వచ్చారు. రాత్రికి దానవాయిగూడెంలో ఉన్న రమేశ్ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి సాగర్ ప్రాజెక్టు కాలువ వద్దకు వచ్చారు. కట్ట దిగువన ఆటోలో వెంకటేశ్వర్లు నిద్రపోగా.. మిగిలిన ముగ్గురు కాల్వ వద్దకు వెళ్లారు. మంగళవారం ఉదయం నిద్ర లేచిన వెంకటేశ్వర్లు.. తన మిత్రులు కనిపించకపోవడం, కాల్వ వద్ద దుస్తులు, చెప్పులు ఉండడంతో.. బంధువులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గాలింపు చేపట్టగా సాయంత్రానికి భరత్ మృతదేహం కొద్ది దూరంలో కాల్వలో బయట పడింది. మిగిలిన ఇద్దరు కాల్వలో గల్లంతయ్యారా.. ఇంకా ఎక్కడికైనా వెళ్లారా అనే అంశంపై స్పష్టత రాలేదు. దీనిపై ఖానాపురం హవేలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నాం.
Also read
- ఎంత కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. లెటర్ రాసి మరీ ఇలా..
- అయ్యో రేవతి.. కొడుకుకు ఈత నేర్పాలనుకుంది.. ఈలోపే ఏమైందంటే..
- మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు!
- పసికందు విక్రయ ఆరోపణలు కలకలం.. తల్లి అంగీకారంతో కేసులో కొత్త ట్విస్ట్
- రూ.33 లక్షల బకాయి బిల్లు కోసం బడికి తాళం.. రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు!





