హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఓ బాలికల అనాథాశ్రమంలో ఉన్న విద్యార్థినులతో గత కొంతకాలంగా కేర్టేకర్ అనుచితంగా ప్రవర్తిస్తోంది. అందులో పనిచేసే ఇద్దరు పురుషుల ఎదుట బాలికల దుస్తులిప్పించి నగ్నంగా నిలబెడుతూ చిత్రహింసలకు గురిచేస్తోంది. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల చొరవతో ఈ విషయం పోలీస్ స్టేషన్కు చేరింది. వివరాల్లోకి వెళితే.. అనాథల పిల్లల కోసం ఓ మహిళ కిస్మత్పూర్లో 15 సంవత్సరాల క్రితం ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 45 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థుల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న బాలికలు ఉన్నారు.
రెండేళ్ల క్రితం ఓ మహిళను పిల్లల బాగోగులు చూసేందుకు కేర్ టేకర్గా నియమించారు. ఆమె బాలికలను చిత్రహింసలకు గురి చేస్తోంది. తాను చెప్పిన మాట వినకపోతే దుస్తులు పూర్తిగా విప్పించి.. ఆశ్రమంలోనే పని చేస్తున్న ఇద్దరు పురుషుల ఎదుట నిగ్నంగా నిలబెడుతోందని బాలికలు వాపోయారు. సెల్ఫోన్లో నీలిచిత్రాలు పెట్టి వాటిని చూడాలని బలవంతం చేస్తోందని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు చదువుతున్న స్కూల్ టీచర్ల సాయంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేర్టేకర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Also read
- హాల్ టికెట్ తీసుకొస్తూ.. అనంత లోకాలకు..
- Video: విధి ఆడిన ఆట.. బైకర్ ఆవేశం.. లారీ డ్రైవర్ కాపాడే యత్నం.. పాపం సాఫ్ట్వేర్ ఇంజనీర్
- KGBVలో అమానుషం.. అర్ధరాత్రి హాస్టల్లో నిద్రిస్తున్న బాలికలపై ఎలుకల దాడి! ఆ తర్వాత..
- Arava Sridhar: ఢిల్లీ కి చేరిన ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్, లోక్ పాల్ చేరిన బాధితురాలి ఆవేదన!
- పోలీస్ వ్యాన్లో నుంచి పుష్ప స్టైల్ లో ‘తగ్గేదేలే’ అన్న అంబటి రాంబాబు





