అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అందరూ చెబుతారు. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. అలాంటి మాతృ హృదయం కూడా కలుషితమై పోతుంది. బండరాయిలా మారిపోతుంది. పేగు ప్రేమను కాదనుకుని చేజేతులా కన్న బిడ్డలను మృత్యువుకి అప్పగిస్తున్నారు నేటి తరం అమ్మలు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి మరో బాధకర సంఘటన..
దేవరకద్ర, సెప్టెంబర్ 12: అన్ని చోట్ల దేవుడు ఉండలేక అమ్మను సృష్టించినట్లు అందరూ చెబుతారు. అమ్మ ప్రేమ ముందు అన్నీ దిగదుడుపే. అలాంటి మాతృ హృదయం కూడా కలుషితమై పోతుంది. బండరాయిలా మారిపోతుంది. పేగు ప్రేమను కాదనుకుని చేజేతులా కన్న బిడ్డలను మృత్యువుకి అప్పగిస్తున్నారు నేటి తరం అమ్మలు. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి మరో బాధకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం చోటు చేసుకుంది. తెల్లవారు జామున ఊరి బయట చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందు ఆక్రమందనలు మిన్నంటాయి. ఒక్కసారిగా అంతా పరుగుపరుగున వచ్చారు. కానీ కన్నతల్లి మాత్రం దరిదాపుల్లో లేకుండా పారిపోయింది. వివరాల్లోకెళ్తే..
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లో బుధవారం ఉదయం 6:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలేసి వెళ్లిపోయారు. తెల్లవారు జామున దేవరకద్ర సహకార సంఘం అధ్యక్షుడు నరేందర్రెడ్డి వాకింగ్కి వెళ్తుండగా.. రోడ్డు పక్కల శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా గోతం బస్తాలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు కనిపించింది. శిశువుకు చీమలు పట్టి, కుట్టి ఉండటం చూసి వెంటనే చేతుల్లోకి తీసుకుని రక్షించాడు. అనంతరం అంగన్వాడీ కార్యకర్త విజయలక్ష్మికి సమాచారం అందించాడు. ఆమె అక్కడికి చేరుకొని పసికందును స్థానిక దవాఖానకు తరలించి, వైద్యం అందించింది. గాయాలకు చికిత్స చేసి, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై నాగన్న శిశువును ఐసీడీఎస్ కేంద్రానికి తరలించారు.
Also read
- BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య
- TG Crime: మహిళ ఎస్సై పై చేయి చేసుకున్న కాంగ్రెస్ నేత
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”