జీడిమెట్లలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శవాలైన కనిపించారు. ఫ్యామిలీ మొత్తం మాస్ సూసైడ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఇద్దరు పసిపిల్లల్ని చంపేసి.. ఆ తర్వాత దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదారబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారాంలో చోటు చేసుకుంది. సహస్రా రెసిడెన్సీ అనే అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి.. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు మంచిర్యాలకు చెందిన వారిగా సమాచారం. వెంకటేష్(40), వర్షిణి(33), పిల్లలు రిషికాంత్(11), విహంత్ (3)గా గుర్తించారు పోలీసులు. భార్యా ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి.. ఆపే వెంకటేశ్ ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు చదవండి
- ఉగాది రోజు ఇంటికి మామిడాకు తోరణాలు ఎందుకు కడతారో తెలుసా?
- ఈ ఉగాది ప్రత్యేకత ఏమిటో తెలుసా? షడ్రుచల పచ్చడి రహస్యం!
- నాలుగు గ్రహాల మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
- నేటి జాతకములు…17 మార్చి, 2026
- ఎంత కష్టమొచ్చిందో.. కన్న బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి





