పండించిన పంటను అమ్మాడు.. మొత్తం రూ.500 నోట్లే.. డబ్బుకట్టను ఇంటికి తెచ్చాడు.. ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టాడు.. తెల్లారే వాటిలోంచి తీసి.. అవసరాల కోసం ఉపయోగిద్దామనుకున్నాడు.. కట్ చేస్తే.. ఎలుకలు అతని కలలను కల్లలుగా చేశాయి.. మొత్తం నోట్లను కొరికేశాయి.. ఈ విచిత్రమైన పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ రైతుకి ఎదురైంది. కష్టపడి పండించిన పంటను అమ్ముకుంటే ఆ సొమ్ము మొత్తం ఎలుకలపాలైంది. నిన్న రాత్రి ఐదు వందల రూపాయల నోట్ల కట్టను బీరువాలో పెడితే… తెల్లారిసరికే ముక్కలు ముక్కలు చేసేశాయ్ ఎలుకలు. ఉదయం బీరువా తెరిచిన రైతు… ముక్కలైన నోట్లను చూసుకుని లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన జి.మాడుగల మండలం రాపల్లి గ్రామంలో జరిగింది..
పసుపును పండించే రైతు బుఠారీ రామారావు… ఎప్పటిలాగే సంతలో పంటను అమ్ముకున్నాడు. మొత్తం పది వేల రూపాయలు వచ్చాయి. అన్నీ ఐదు వందల రూపాయల నోట్లే. ఆ డబ్బును తీసుకొచ్చి బీరువాలో దాచుకున్నాడు రామారావు. ఇవాళ లేచి చూసుకునేసరికి నోట్లు మొత్తం ముక్కలుముక్కలై కనిపించాయ్. ఆ సీన్ను చూసిన రైతు రామారావు షాక్కి గురయ్యాడు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎలుకలపాలైందంటూ ఆవేదన చెందుతున్నాడు.
వీడియో..
Also read :
- భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!
- నాటు తుపాకీతో యువకుడు హల్చల్!
- పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
- నేటి జాతకము 29 జూలై, 2026
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?





