October 17, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra Pradesh: పులివెందులలో వెలుగులోకి అమానుష ఘటన.. కసాయిలా ప్రవర్తించిన తల్లి!

రాను రాను మానవత్వం మంట కలిసిపోతోంది. కన్న బిడ్డల పట్ల సైతం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఓ కన్నతల్లి కూతురికి చేతులపై వాతలుపెట్టి చిత్రహింసలకు గురిచేసింది. తండ్రిని చూడడానికి వెళ్ళినందుకు కూతురుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఈ అమానుష ఘటన కడప జిల్లా పులివెందులలో వెలుగు చూసింది.

Also read :AP News: అడవిలో దొరికిన గుడ్లను తీసుకొచ్చి కోడితో పొదిగించాడు… కట్ చేస్తే…

పులివెందుల నియోజకవర్గం లోని సింహాద్రిపురం మండలం అహోబిలాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతకాలం క్రితం విభేదాలతో విడిపోయిన సోమేశ్వరమ్మ ఆమె భర్త రామడు వేరువేరుగా కాపురం ఉంటున్నారు. అయితే తల్లి వద్దనే ఇద్దరు కుమార్తెలు ఉంటున్నారు. తండ్రి మీద మక్కువతో తండ్రిని చూసేందుకు వెళ్లింది పెద్ద కుమార్తె. ఈ విషయం తెలిసిన తల్లి, కూతురుని నిలదీసింది. తండ్రిని చూసేందుకు వెళ్లడంతో ఆగ్రహంతో చితకబాదింది. ఇష్టానుసారంగా చేతిపై వాతలు పెట్టింది. తల్లి అనే మానవత్వాన్ని మరిచి కసాయిగా మారింది.

Also read :Raj Tarun News : నా రాజ్‌ను కలవనివ్వండి.. ప్రసాద్ ల్యాబ్ దగ్గర లావణ్య హంగామా.. అడ్డుకున్న పోలీసులు
దంపతులు ఇద్దరు విడిపోయినా పిల్లల భావాలను అర్థం చేసుకోవాల్సిన తల్లి కసాయిలా ప్రవర్తించింది. తండ్రి వద్దకు వెళ్లకూడదు అనే హుకుం పిల్లలకు జారీ చేసింది. ఈ సంఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలకు మంచిగా చెప్పుకోవాల్సిన పరిస్థితులను మానుకొని వారిపై కక్షపూరిత వ్యవహారించడం ఎంటని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి రాముడు తల్లి వద్ద ఉన్న కూతురిని తీసుకొని వెళ్లి స్థానిక సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ లో తల్లి సోమేశ్వరముపై ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది

Also read :Pakistan: పరువు తీస్తోందని కుమార్తె కాళ్లు నరికేసిన తండ్రి.!

Related posts

Share via