October 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

ముప్పిరెడ్డిగారి పల్లెలో దారుణం….బాలికపై అత్యాచారం

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని ఓ గ్రామంలో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన దంపతులు కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు

కల్లూరు, : చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని ఓ గ్రామంలో పదేళ్ల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన దంపతులు కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. శుక్రవారం భార్య కూలీ పనికి వెళ్లగా.. భర్త అడవికి కట్టెల కోసం వెళ్లారు. వీరి కుమార్తె (10) స్థానిక సచివాలయ వద్ద ఆడుకుంటుండగా.. అదే గ్రామానికి చెందిన తాపీమేస్త్రీ రెడ్డిహుస్సేన్ (28) సమీపంలోని తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికొచ్చిన తండ్రికి కుమార్తె కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. తోటలో చూడగా.. కుమార్తె ఏడుస్తూ వచ్చి జరిగిన విషయాన్ని తండ్రితో చెప్పింది. దీనిపై కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శనివారం నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవిప్రకాష్రెడ్డి వెల్లడించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Also read :పోలీస్‌ డాగ్‌ సాహసం.. వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి మహిళ ప్రాణాలు కాపాడింది..

అందమైన భార్య.. ఆ ఒక్క పనిచేయలేదని భర్త దారుణం!

Telangana: వనజీవులను ముప్పు తిప్పలు పెట్టే నక్కలు ఆపదలో పడ్డాయి.. ఏం జరిగిందంటే..?

Related posts

Share via