October 18, 2024
SGSTV NEWS
Andhra PradeshCrime

Watch Video: ఆమ్మవారి ఆలయంలో ఊహించని ఘటన.. షాకైన ధర్మకర్తలు, భక్తులు..

దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల కష్టాలు తీర్చే అమ్మవారి ఆలయంలోనే దొంగలు చోరీకి తెగబడ్డారు. కర్నూలు జిల్లాలోని అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. అమ్మవారిని ఆలయంలోకి చొరబడి హుండీ పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో పెద్ద మరవీడు గ్రామ శివారులో ఉన్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయంలో రోజూ మాదిరిగానే ధర్మకర్తలు, భక్తులు అమ్మవారి గుడికి వచ్చారు. అయితే ఆలయ తలుపులు తెరిచి ఉండటం చూసి అందరు షాక్ తిన్నారు.

Also read :Watch Video: సర్టిఫికేట్ల కోసం వచ్చిన విద్యార్థి.. స్పృహ కోల్పోవడంతో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ఆలయంలోని హుండీ చిందర వందరగా పడిఉండటం చూసి ఖంగుతిన్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆలయానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఎడాది నుంచి హుండీ తెరవకపోవడంతో అందులో మొత్తం ఉన్న సొత్తు, అమ్మవారి బంగారు ఆభరణాలు, ఎత్తికెళ్లినట్లు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు తెలిపారు. రోడ్డు పక్కనే వున్న ఆలయంలో చోరీ చేసారంటే ఎవరో పకడ్బందీగా ప్లాన్ వేసుకుని చేసి వుంటారిని, అనుమానం వ్యక్తం చేశారు. హుండీ డబ్బులతో ఆలయానికి పునరుద్ధరించుకోవాలనుకుంటున్న సమయంలో ఇలా చోరీ జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు.

వీడియో…

Also read :చిన్న వయసులోనే దానికి అడిక్ట్ అయ్యింది! నర్స్ కావాలనుకుని!

Related posts

Share via